మావోయిస్టుల చర్యలను తిప్పికొడతాం : డీజీపీ మహేందర్ రెడ్డి

భద్రాద్రి కొత్తగూడెం : తెలంగాణలోకి మావోయిస్టులు ప్రవేశించాలని చూస్తే వారి చర్యలను తిప్పికొడతామని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న లక్ష్మీదేవిపల్లి మండలం హేమచంద్రాపురంలో జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేసిన ఫైర్ రేంజ్, పరేడ్ గ్రౌండ్, బీఓఏసీని డీజీపీ బుధవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ దండకారణ్యాన్ని కేంద్రంగా చేసుకుని పావులు కదుపుతున్న మావోయిస్టులు తెలంగాణలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తే వారి చర్యలను తిప్పికొడతామని అన్నారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసుల పనితీరు చాలా బాగుందని ఆయన కొనియాడారు. జిల్లా సరిహద్దులో ఉన్న ఛత్తీస్గఢ్ రాష్ర్టం నుంచి మావోయిస్టులు చొరబడకుండా ఇక్కడి పోలీసు అధికారులు యాంటీ నక్సల్స్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ వారి చర్యలను నిర్మూలిస్తున్నారన్నారు. ప్రతి ఒక్క పోలీసు అధికారి సిబ్బంది బాధ్యతగా పనిచేస్తూ ఎప్పటికప్పుడు మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం సేకరిస్తూ అప్రమత్తంగా ఉంటున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి పథకాలను ముందుకు తీసుకెళ్తూ, ఎలాంటి హింసకు తావులేకుండా ప్రజలకు సహకారాన్ని అందిస్తోందన్నారు. పోలీస్ రిక్రూట్మెంట్లో స్థానిక యువతకు కూడా అవకాశం కల్పించడం జరుగుతుందని డీజీపీ మహేందర్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
పీవీ దేశ చరిత్రలో నిలిచిపోతారు : సీఎం కేసీఆర్
ఆ ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలి : ఎమ్మెల్సీ కవిత
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి: మంత్రి నిరంజన్రెడ్డి
తాజావార్తలు
- వస్తువు ఒక్కటే ఉపయోగాలెన్నో..!
- పర్సనల్ వెహికిల్స్కూ ఫిట్నెస్ తప్పనిసరి చేయాలి: ఆర్సీ భార్గవ
- బేకింగ్ సోడా, డయాబెటీస్కి సంబంధం ఏంటి..?
- కనకరాజుకు గవర్నర్ తమిళిసై శుభాకాంక్షలు
- ఆగని పెట్రో మంటలు
- ఎన్నికల్లో ఎవరైనా ప్రలోభపెడితే రెండేళ్ల జైలు శిక్ష
- రవితేజ 'హల్వా డాన్స్' అదిరింది..వీడియో
- మహిళలు ఆర్థికంగా ఎదగాలి మంత్రి గంగుల
- హింస ఆమోదయోగ్యం కాదు: పంజాబ్ సీఎం
- భూ తగాదాలతో వ్యక్తి హత్య