హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ): పశ్చిమబెంగాల్లోని దుర్గాపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్కు తొలి ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ శుక్రవారం బయలుదేరింది. 40 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను, నాలుగు క్రయోజనిక్ ఆక్సిజన్ ట్యాంకర్లలో తరలిస్తున్నట్టు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. నెల్లూరు మీదుగా కృష్ణపట్నం తరలిస్తున్నట్టు పేర్కొన్నారు.