న్యూఢిల్లీ: ఐపీఎల్-2021 ముంగిట రాజస్థాన్ రాయల్స్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆర్చర్ వచ్చే వారం తన కుడి చేతికి శస్త్ర చికిత్స చేయించుకోబోతున్నాడు. భారత్తో వన్డే సిరీస్ కు దూరమైన ఆర్చర్ వెంటనే స్వదేశానికి తిరిగి వెళ్లాడు. అక్కడ తన మోచేతికి మరో ఇంజెక్షన్ కూడా వేశారు. ఈ ఏడాది జనవరిలో ఆర్చర్ తన ఇంటిని శుభ్రం చేస్తుండగా గాయపడ్డాడు. అప్పటి నుంచి ఇంజెక్షన్లు తీసుకుంటూనే ఉన్నాడు. ఇటీవల భారత్తో టెస్టు, టీ20ల్లో పాల్గొన్నాడు. దీంతో గాయం తీవ్రత మరింత ఎక్కువైంది. తాజాగా వైద్య నిపుణుల సలహా మేరకు శస్త్రచికిత్స చేయించుకోనున్నాడు. రాజస్థాన్ టీమ్లో కీలక ఆటగాడిగా ఉన్న జోఫ్రా లేకపోవడంతో ఆ జట్టు కూర్పుపై ప్రభావం పడనుంది.