హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి వద్ద విధుల్లో ఉన్న ఓ పోలీసు కానిస్టేబుల్, హోం గార్డ్ను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు. గాంధీ ఆస్పత్రి వద్ద ఉన్న ఓ గర్భిణి నడవలేని స్థితిలో ఉంది. ఆమెను కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డ్ ఇమ్రాన్ గమనించారు. నడవలేని స్థితిలో ఉండి, పురిటినొప్పులతో బాధపడుతున్న ఆమెను వారిద్దరూ తమ చేతుల మీద ప్రసూతి వార్డులోకి మోసుకెళ్లారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ క్రమంలో కిరణ్, ఇమ్రాన్ను డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.