చేర్యాల/సిద్దిపేట : కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రంలో ఆదివారం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. సుమారు 5 వేల మంది భక్తులు ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయవర్గాలు తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి భక్తులు చేరుకున్నారు.
ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి మొక్కులు చెల్లించుకోవడంతో పాటు మరికొందరు భక్తులు స్వామి వారి నిత్య కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. అలాగే కొండపైన ఉన్న ఎల్లమ్మను దర్శించుకోవడంతో పాటు మట్టి పాత్రలతో అత్యంత భక్తిశ్రద్ధలతో బోనం తయారు చేసి మొక్కులు తీర్చుకున్నారు.
ఇవి కూడా చదవండి.
ఇద్దరు చైన్ స్నాచర్ల అరెస్ట్
బోనమెత్తిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్రెడ్డి
వెలుగులోకి మరో పోర్న్ రాకెట్ ..కటకటాల వెనక్కి వర్ధమాన నటి
300 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత