చేర్యాల/సిద్దిపేట : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఆదివారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ప్రైవేటు, ఆలయ నిర్వహణలో ఉన్న దాతల గదులను అద్దెకు తీసుకుని రాత్రికి బస చేశారు. అనంతరం ఆదివారం వేకువ జామునే నిద్రలేచి కాటేజీలలో పవిత్రంగా స్నానాలు అచరించారు.
స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశ ఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు తదితర మొక్కులు తీర్చుకోవడంతో పాటు కొరికలు తీర్చాలని స్వామి వారిని వేడుకున్నారు.
మహిళల భక్తిశ్రద్ధలతో బోనాలు తయారు చేసి కొండ పైన ఉన్న ఎల్లమ్మ తల్లికి బొనాలు సమర్పించారు. స్వామి వారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు ఎలాంటి సమస్యలు తలేత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆలయ ఈవో తెలిపారు.
ఇవి కూడా చదవండి..
కాంగ్రెస్, సీపీఐల నుంచి టీఆర్ఎస్లో చేరికలు
గన్తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న పోర్న్ స్టార్
యాదాద్రిలో వైభవంగా స్వాతి నక్షత్ర పూజలు
భాగవత పద్యాలతో మంత్రముగ్ధుల్ని చేసిన సింగపూర్ చిన్నారులు