చేర్యాల/సిద్దిపేట : కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని ఆదివారం భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చిన భక్తులు ఉదయం నుంచి కురుస్తున్న ముసురును లెక్కచేయకుండా మల్లన్న స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుమారు 15 వేల మంది భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ ఏఈవో వైరాగ్యం అంజయ్య తెలిపారు. శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి..
రైలుకింద పడి తల్లీ, కూతురు మృతి..కుమారుడి పరిస్థితి విషమం
తెలంగాణ ఇంజినీర్లు దేశానికే మార్గదర్శకులు
వింబుల్డన్ చాంపియన్ ఓ క్రికెటర్ అని మీకు తెలుసా?
యాదాద్రీశుడి సేవలో జీహెచ్ఎంసీ మేయర్
నాటు తుపాకితో బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
గుండెపోటుతో మేడారం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ మృతి