రాజన్న సిరిసిల్ల : కరోనా నేపథ్యంలో రెండు నెలలుగా వెలవెలబోయిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం సోమవారం భక్తులతో పోటెత్తింది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకొని వేకువజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. స్వామివారి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
శివుడికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు, కల్యాణ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాలు బద్దిపోచమ్మ, నగరేశ్వర, భీమేశ్వరాలయాలను దర్శించుకొని పూజలు చేశారు. ఇటీవల కాలంలో ఎన్నడూలేనివిధంగా సుమారు 40 వేల మంది భక్తులు రాజన్నను దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. సుమారు 24 లక్షల ఆదాయం సమకూరిందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
టాయిలెట్లు శుభ్రం చేసిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
యాదాద్రిలో వైభవంగా లక్షపుష్పార్చన
ఆగని పెట్రో వడ్డన.. లీటర్పై 35 పైసలు పెంపు
హరితహారం దేశానికే స్ఫూర్తిదాయకం