వనపర్తి : మనోధైర్యమే అసలైన మందు అని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కరోనా బాధితలకు ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుందన్నారు. గురువారం జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలను సందర్శించి కొవిడ్ రోగులను పరామర్శించారు. వారి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. మంత్రి కరోనా రోగులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..కొవిడ్ రోగులకు అన్ని రకాల వైద్య సేవలను ప్రభుత్వం అందుబాటులో ఉంచాయన్నారు.
ఎట్టి పరిస్థితిలోను మనోధైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలన్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ మాస్క్ వేసుకొని భౌతిక దూరం పాటించటం వల్ల కరోనాను కట్టడి చేయవచ్చన్నారు. ఒకవేళ కోవిడ్ వచ్చినా వెంటనే వైద్యం తీసుకొని హోం ఐసోలేషన్ లో ఉంటే త్వరగా బయట పడతారన్నారు.
లాక్ డౌన్తో మంచి ఫలితాలు వస్తున్నాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దవాఖానల్లో డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్ లు, వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరు చాలా బాగా పని చేస్తూ రోగులకు సేవలు చేస్తున్నరని కొనియాడారు.
కార్యక్రమంలో ఆర్డీవో అమరేందర్, దవాఖాన ఆర్ఎంవో చైతన్య గౌడ్, సూపరింటెండెంట్ హరీష్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
ధైర్యం కోల్పోవద్దు..నిర్లక్ష్యం చేయొద్దు
వైద్యుల సేవలు వెలకట్టలేనివి : మంత్రి నిరంజన్ రెడ్డి
కొవిడ్ బాధితులకు అండగా ఉంటాం : మంత్రి ఎర్రబెల్లి
సిద్దిపేట లయన్స్ క్లబ్ సేవలు అభినందనీయం
లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు