మంత్రి కేటీఆర్ అభినందన
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా నరంగికి చెందిన గాయని శ్రావణిలో చాలా ప్రతిభ ఉన్నదని, ఆమెను ప్రోత్సహించాలని మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్కు ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మరోసారి స్పందించారు. ‘కేటీఆర్ సర్.. మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. శుక్రవారం చెన్నైలో నిర్వహించిన ‘స్టార్ టూ రాక్స్టార్’ షోలో శ్రావణికి అవకాశం కల్పించా. ఆమె అదరగొట్టింది. జీ-తమిళ్ చానల్లో ఆదివారం రాత్రి 7.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని చూడండి. శ్రావణి నిజంగానే చాలా ప్రతిభావంతురాలు. ఆమె గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు’ అని దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. దీంతో దేవిశ్రీ చాలా గొప్ప పనిచేశారని మంత్రి కేటీఆర్ అభినందించారు.