నిజామాబాద్ : బాన్సువాడ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వెంటనే చేపట్టాలని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై మంగళవారం హైదరాబాద్ లోని తన అధికార నివాసం నుంచి వీడియో కాల్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ..బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ. 100 కోట్లను స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్ గా మంజూరు చేశారు. అదేవిధంగా ఐదువేల డబుల్ బెడ్ రూం ఇండ్లను మంజూరు చేశారన్నారు.
ఈ పనులకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి అనుమతి వచ్చింది. తక్షణమే పనులను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనులను పూర్తి చేయాలని సూచించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు సూచించిన పనులనే మంజూరు చేశాం.
నామినేషన్ పద్ధతిలో చేసే పనులను తక్షణమే ప్రారంభించాలన్నారు. టెండర్ అవసరమైన పనులకు అధికారులు ప్రాసెస్ ను తక్షణమే ప్రారంభించాలని సూచించారు. నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
అనుమానంతో భార్య గొంతు నులిమి చంపిన భర్త
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి