శామీర్పేట, జూలై 3 : గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యంగా ఉంటామని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శనివారం సీఎం దత్తత మండలం మూడుచింతలపల్లిలోని కొల్తూర్ గ్రామం లో నిర్వహించిన పల్లె ప్రగతిలో పాల్గొని మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం ప్రతి నెల గ్రామానికి రూ.7 లక్షలు మంజూరు చేస్తున్నారని తెలిపారు. అదనపు కలెక్టర్ శ్యాంసన్, సీఈవో దేవసహాయం, డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మధుకర్రెడ్డి, జడ్పీటీసీ అనితాలాలయ్య, ఎంపీపీ హారికామురళీగౌడ్, కో ఆప్షన్ సభ్యుడు గౌస్పాషా, డీఎల్పీఓ స్మిత, ఎంపీడీఓ సువిధ, తాసీల్దార్ బాలవిశ్వనాథ్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్రెడ్డి పాల్గొన్నారు.