మహబూబాబాద్ : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సీఎం కేసీఆర్కు రెండు కండ్లలాంటివని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లాలోని సీరోల్ లో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో అదనపు గదులు, ఆట స్థలాలకు స్థానిక ఎమ్మెల్యే రెడ్యా నాయక్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ తెలంగాణ కావాలని కోరుకుంది ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం కోసమేనన్నారు.
తెలంగాణ ఏర్పడ్డప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. కానీ సీఎం కేసీఆర్ నాయకత్వంలో అవన్నీ అధిగమించి నేడు దేశంలో అనేక రంగాల్లో మన రాష్ట్రం అగ్రగామిగా కొనసాగుతున్నదని తెలిపారు.
విద్య ద్వారానే సమగ్ర అభివృద్ధి సాధ్యమని నమ్మి తెలంగాణ వచ్చినపుడు 300 గురుకులాలు ఉంటే వాటిని తెలంగాణ వచ్చాక 1000 కి పైగా ఏర్పాటు చేశారు.
నాణ్యమైన విద్య, భోజనం అందిస్తూ మన విద్యార్థులను దేశ, విదేశీ స్థాయిలో అందరితో పోటీ పడే విధంగా తయారు చేస్తున్నామని పేర్కొన్నారు.
గిరిజన యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నాం.
గత ఏడాది కోవిడ్ ఉన్నా మన గిరిజన బిడ్డలు 180కి పైగా విద్యార్థులు NIT, IIIT, IIT, MBBS లలో ఉత్తమ ప్రతిభ కనపర్చి సీట్లు సాధించారని ప్రశంసించారు.
వృత్తి విద్యలలో కూడా మరిన్ని కోర్సులను పెట్టీ గిరిజన విద్యార్థులకు నైపుణ్యం పెంపొందించి జీవితంలో స్థిరపడే విధంగా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, కలెక్టర్ వి.పి గౌతమ్, జెడ్పీటీసీ బండి వెంకటరెడ్డి, ఆర్డీవో కొమురయ్య, ఇతర అధికారులు నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
మరణంలోనూ వీడని భార్యాభర్తల బంధం
శంషాబాద్లో కారు,లారీ ఢీ..ఆరుగురు మృతి, 15 మందికి గాయాలు
ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
గాలి ద్వారా కరోనా చాలా ఆందోళనకరం: ఎయిమ్స్ చీఫ్
భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్ల పట్టివేత