యాదాద్రి: రాష్ట్రంలోని దేవాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు పీఆర్సీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వానికి రాష్ట్ర ప్రధాన దేవాలయాల ఉద్యోగుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు రాష్ట్ర ప్రధాన దేవాలయాల జేఏసీ చైర్మన్ గజవెల్లి రమేశ్బాబు తెలిపారు. గురువారం హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఎండోమెంట్స్ జాయింట్ సెక్రటరీ టీ. శేఖర్ చేతులమీదుగా పీఆర్సీ పెంపు ఉత్తర్వులను అందుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగుల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలలో అమలు కానీ పీఆర్సీని ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయడం ఆనందంగా ఉందన్నారు. దేవాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు పీఆర్సీ-2020 అమలు చేయాలని విజ్ఞప్తి చేసిన వెంటనే స్పందించి అమలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు పీఆర్సీ అమలుకు కృషి చేసిన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్, ప్రధాన కార్యదర్శి ప్రతాప్కు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞలు తెలిపారు.