హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): వివిధ స్థాయిల్లో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సోమవారం సాయంత్రం కల్లా పంపించాలని తమ శాఖాధికారులను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. ఆదివారం ఖైరతాబాద్లోని మంత్రి కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా, ఇంజినీరింగ్ విభాగం, సెర్ప్, స్త్రీనిధి, ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఈజీఎంఎం, స్వామి రామానందతీర్థ ఇన్స్టిట్యూట్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, కమిషనర్ రఘునందన్రావు, ఉప కార్యదర్శి ఆయేషా, ఇంజినీరింగ్ విభాగం ఈఎన్సీ సంజీవరావు, డిప్యూటీ కమిషనర్ రవీందర్రావు, మిషన్ భగీరథ చీఫ్ ఇంజినీర్ చక్రవర్తి, సెర్ప్, ఈజీఎంఎం పాల్గొన్నారు.