సిల్వర్ స్క్రీన్ పై కొన్ని సార్లు అరుదైన కాంబినేషన్స్ ప్రేక్షకులను ఎక్జయిటింగ్ కు గురిచేస్తుంటాయి. అలాంటి కాంబినేషన్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. యూత్ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ శేఖర్ కమ్ముల. ఈ డైరెక్టర్ జోనర్ లో సినిమా తీయాలంటే అందరికీ సాధ్యం కాని పని. మరోవైపు క్లాస్ అయినా మాస్ అయినా ధనుష్ సినిమా చేశాడంటే బాక్సాపీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురుస్తుంది.
ఇపుడు ఇదే జోడీ తెరపై సందడి చేయనుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. శేఖర్ కమ్ముల ఓ స్టోరీని ధనుష్ కు వినిపించగా..ధనుష్ పచ్చజెండా ఊపాడన్న వార్త టాలీవుడ్, కోలీవుడ్ లో జోరుగా వినిపిస్తోంది. యూనివర్సల్ టచ్తో పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందట.
ఇప్పటికే పలు హిందీ సినిమాలతో నార్త్ ప్రేక్షకులకు పరిచయమైన ధనుష్..మరి ఈ సారి శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడన్న అప్ డేట్ తో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ తెరరూపం దాలుస్తుందా..? లేదా చూడాలి.
ఇవి కూడా చదవండి..
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
స్పెషల్ సాంగ్ లాంఛ్ చేయనున్న సమంత
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్