హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కే తారక రామారావును మంగళవారం ప్రగతిభవన్లో శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్ (చెన్నై) డాక్టర్ డీ వెంకటేశ్వరన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న ఐటీ, పరిశ్రమలు, తదితర రంగాల అభివృద్ధిని మంత్రి కేటీఆర్ ఆయనకు వివరించారు. ప్రపంచం నలుమూలల నుంచి రాష్ర్టానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని డిప్యూటీ హైకమిషనర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ పాల్గొన్నారు.