హైదరాబాద్: ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడం కోసం డీఈసీ (డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ)లను ఏర్పాటు చేస్తూ తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ విడుదల చేశారు. డీఈసీ సభ్యులుగా కొందరు కాలేజి ప్రిన్సిపాల్స్ను, జూనియర్ లెక్చరర్లను నియమించారు. ఇంటర్మీడియెట్ పబ్లిక్ ఎగ్జామినేషన్ నిర్వహణ మాన్యువల్ నిబంధనలతోపాటు టీఎస్బీఐఈ సెక్రటరీ ఇచ్చే సూచనలు, సలహాలను అమలు చేయడం వీరి విధి.
కాగా, కరోనా కారణంగా చాలామంది విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 70 శాతం సిలబస్తోనే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే.