హైదరాబాద్ : డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే దోస్త్ మొదటి విడత సీట్ల కేటాయింపు బుధవారం వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా 1.67 లక్షల మంది విద్యార్థులకు డిగ్రీ సీట్లు కేటాయింపు జరిగింది. వీరిలో 89,109 మంది అమ్మాయిలు కాగా 78,021 అబ్బాయిలు ఉన్నారు. అత్యధికంగా కామర్స్లో 65,897 మందికి సీట్ల కేటాయింపు. ఒక్క సీటు కూడా భర్తీకాని డిగ్రీ కాలేజీలు 27 ఉన్నట్లు దోస్త్ కన్వీనర్ లింబాద్రి తెలిపారు. సీటు వచ్చిన అభ్యర్థులు దోస్త్ వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. రేపట్నుంచి ఈ నెల 18 వరకు దోస్త్ విడత రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లకు అవకాశమని ఆయన పేర్కొన్నారు.ఈ నెల 25న రెండవ విడత సీట్లు కేటాయించనున్నారు.