హైదరాబాద్: గులాబ్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శనివారం ఉదయం నుంచి రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. మరోవైపు రేపు, ఎల్లుండి కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28, 29 తేదీల్లో (రేపు, ఎల్లుండి) రాష్ట్రంలో జరుగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను వాయిదా వేశారు ( Exams postponed ). ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. వాయిదా పడిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తామని ఆమె పేర్కొన్నారు.