సుల్తాన్బజార్, మే 25 : జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ అకాడమిక్ ప్లానింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎస్కే రహమాన్ కరోనాతో మృతిచెందారు. వారంక్రితం కరోనా బారినపడిన ఆయనను కుటుం బ సభ్యులు ఓ ప్రైవేటు దవాఖానలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం సోమవారం సాయంత్రం నిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం చనిపోయారు. ఆయన జేఎన్ఏఎఫ్ఏ యూనివర్సిటీ ఫైన్ఆర్ట్స్ కళాశాలలోని ఫొటోగ్రఫీ విభాగం ప్రొఫెసర్గా, వర్సిటీ రిజిస్ట్రార్గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం వర్సిటీ అకాడమిక్ ప్లానింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. రహమాన్ మృతిపట్ల వర్సిటీ ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కవితా దర్యాని, రిజిస్ట్రార్ ఫణిశ్రీ, తెలంగాణ విశ్వ విద్యాలయాల భోధనేతర ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు కే మహిపాల్రెడ్డి రహమాన్ మృతికి సంతాపం ప్రకటించారు.