పిట్లం/గాంధారి, మే 17 : పిట్లం మండలకేంద్రంలో లాక్డౌన్ నిబంధనలు పాటించకుండా ఓ వస్త్ర వ్యాపారి దుకాణాన్ని తెరిచి ఉంచడంతో స్థానిక పంచాయతీ, పోలీసు అధికారులు సోమవారం రూ.2వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి విఠల్రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం విధించిన లాక్డౌన్కు వ్యాపారులు సహకరించాలని, నిబంధనలు ఉల్లంగించిన వారికి జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే దుకాణాలను తెరిచి ఉంచాలని సూచించారు. ఆయన వెంట సిబ్బంది గంగారాం తదితరులు ఉన్నారు.
వాహనదారులకు జరిమానా
ట్రాఫిక్, కొవిడ్ నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానా విధించినట్లు గాంధారి ఎస్సై శంకర్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రధాన రహదారితోపాటు పెట్రోల్బంక్ సమీపంలో వాహనాల తనిఖీ చేపట్టి 118 మంది వాహనదారులకు జరిమానా వెల్లడించారు. హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడుపుతున్న 118 మందికి 25 వేల 530 రూపాయలు, మాస్కులు ధరించని తొమ్మిది మందికి వెయ్యి రూపాయల చొప్పున జరిమానా విధించినట్లు ఎస్సై వివరించారు. ఆయన వెంట కానిస్టేబుళ్లు, హోంగార్డులు ఉన్నారు.