మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలలో రాక్షసుడు ఫేం రమేష్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ఖిలాడి. ఈ నెలలో విడుదల కావలసి ఉన్న ఖిలాడి కరోనా వలన వాయిదా పడింది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు ఓటీటీ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ ఈ చిత్రాన్ని ఆరు కోట్లకు పైగా ధర చెల్లించి డిజిటల్ రైట్స్ దక్కించుకుందని, ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయనున్నారని జోరుగా ప్రచారం నడుస్తుంది. ఈ క్రమంలో మేకర్స్ పోస్టర్ ద్వారా పూర్తి క్లారిటీ ఇచ్చారు.
ఖిలాడి చిత్రాన్ని థియేటర్స్లోనే విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ చిత్రంలో రవితేజ డ్యూయల్ రోల్స్ లో నటిస్తుండగా డింపుల్ హయాతి, సాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. యాక్షన్ కింగ్ అర్జున్ ఈ సినిమాలో ప్రతినాయకుడిగా నటిస్తుండటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ పెన్ మూవీస్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతం ఉంటుందని.. అందులో అందాల తార ప్రణీత నర్తిస్తుందని సమాచారం. యాంకర్ అనసూయ కూడా ప్రత్యేక పాత్రలో మెరవనుంది.