హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): రెవెన్యూశాఖలో పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి, పరిష్కరించేందుకు కృషి చేయాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్ (ట్రెసా) రాష్ట్ర కమిటీ తీర్మానించింది. ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి అధ్యక్షతన శామీర్పేటలో అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం జరిగింది. రెవెన్యూశాఖలోని ఖాళీలను భర్తీ చేయాలని, క్యాడర్వారీగా జాబ్చార్ట్ను ప్రకటించాలని, పదోన్నతులు కల్పించాలని, కార్యాలయాల నిర్వహణకు బడ్జెట్ కేటాయించాలని రాష్ట్ర కార్యవర్గం తీర్మానించింది. సమావేశంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మన్నె ప్రభాకర్, పూల్సింగ్, రాజ్కుమార్, రియాజుద్దీన్, ఉపాధ్యక్షులు రామకృష్ణ, యాదగిరి, ఎల్బీ శాస్త్రీ, చైతన్య, మంజుల, బండారు రవీందర్, బాణాల రాంరెడ్డి పాల్గొన్నారు.