కొత్తూరు : జేపీ దర్గా విస్త్రరణ పనులు త్వరగా పూర్తి చేయాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వక్ఫ్బోర్డు అధికారులకు సూచించారు. కొత్తూరు మండల పరిధిలోని చారిత్రక జహంగీర్ పీర్ దర్గా విస్త్రరణ, అభివృద్ధి పనులపై హైదరాబాద్లో శనివారం మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో జేపీ దర్గా వద్ద ముఖ్యులతో సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని చెప్పిన విషయాన్ని మంత్రులు గుర్తు చేసుకున్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దర్గాను సందర్శించిన సీఎం కేసీఆర్ విస్తరణ, అభివృద్ధి కోసం రూ. 50కోట్లు మంజూరు చేశారని వారు పేర్కొన్నారు.
విస్తరణ పనులు ఎంత వరకు వచ్చాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూ సేకరణ పనులు తక్షణమే పూర్తి చేయాలని వారు స్పష్టం చేశారు. అలాగే సంబంధిత వ్యాపారులతో చర్చించి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో వక్ఫ్బోర్డు చైర్మన్ సలీం, మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారు ఏకే ఖాన్, ప్రభుత్వ కార్యదర్శి నదీమ్ అహ్మద్, వక్ఫ్బోర్డు డైరెక్టర్ షానవాజ్ ఖాసీం పాల్గొన్నారు.