బెంగళూరు: అనుభవం, యువ ప్లేయర్ల మేళవింపుతో ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్కు భారత మహిళల హాకీ జట్టు ఎంపికైంది. విశ్వక్రీడల్లో పతకమే లక్ష్యంగా రాణిరాంపాల్ సారథ్యంలో16 మంది ప్లేయర్లతో కూడిన జట్టును హాకీ ఇండియా గురువారం ప్రకటించింది. 2016 రియో ఒలింపిక్స్లో పాల్గొన్న 8 మంది ఈ జట్టులో ఉండగా.. మరో 8 మంది ప్లేయర్లకు ఇవే తొలి విశ్వక్రీడలు. గుర్జిత్ కౌర్, ఉదిత, నిషా, నవ్నీత్ కౌర్, షర్మిలా దేవి, లాల్రెసియామి, సలిమా తెటె తొలిసారి ఒలింపిక్స్కు ఎంపికయ్యారు.