బండి సంజయ్కి దళితుల డిమాండ్
హుజూరాబాద్/హైదరాబాద్, జూన్ 7(నమస్తే తెలంగాణ): అక్రమాస్తులపై ప్రశ్నించినందుకు దళితులపై అక్రమకేసులు పెట్టి, జైల్లో పెట్టించిన ఈటల రాజేందర్ను బీజేపీలో చేర్చుకోవద్దని ఈటల దళిత బాధితుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు తిప్పారపు సంపత్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తదితరులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని కలిసి సోమవారం వినతిపత్రం అందజేశారు. 2018లో ఈటల అక్రమాస్తుల గురించి ప్రశ్నించినందుకు తమను జైల్లో పెట్టించారని పేర్కొన్నారు. అధికార దుర్వినియోగం చేసిన వ్యక్తిని, దళితులపై అరాచకాలు చేసిన వ్యక్తిని బీజేపీలో చేర్చుకొంటే హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితుల ఓట్లు దూరమయ్యే అవకాశం ఉన్నదని, ఆయన్ను పార్టీలో చేర్చుకోవడంపై పునరాలోచించుకోవాలని స్పష్టంచేశారు.