యాదగిరిగుట్ట రూరల్: సీఎం కేసీఆర్ దళితబంధు ప్రకటించి అమలు చేయడాన్ని హర్షిస్తూ యాదగిరిగుట్ట మండలం మాసాయిపేట గ్రామంలో అంబేద్కర్ చిత్రపటం వద్ద దళితులు ఆదివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘం నాయకులు మాట్లాడుతూ దళిత కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రకటించిన ఈ సాయం గొప్పదన్నారు. కేసీఆర్కు దళిత జాతి రుణపడి ఉంటుందని చెప్పారు.
దీని ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకొని ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేయొచ్చన్నారు. కార్యక్ర మంలో సుంచు భాస్కర్, బర్ల ఈదయ్య, బర్ల శివయ్య, మైలారం నర్సింహులు, గ్యార శ్రీను, బర్ల యాకయ్య, గ్యార అంజనేయులు, రవి రాజు, సత్తయ్య, పోచయ్య, నర్సింగ రావు, నాగరాజు, మహేశ్, తరుణ్, పరుశురాం, సూరి, నరేశ్, టీఆర్ఎస్ మండల నాయకులు వంటేరు సురేశ్రెడ్డి, గొట్టిపర్తి బాలరాజ్గౌడ్, సొప్పరి మధు, బాల సిద్ధులు తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో
ఆత్మకూరు(ఎం): దళితబంధును హర్షిస్తూ ఆదివారం మండల కేంద్రంలోని దళితవాడలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి దళితులందరూ క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి కదిరె నవీన్, కిష్టయ్య, నర్సింగరావు, రాజు, యాదయ్య, లక్ష్మయ్య, నరేశ్, సురేశ్, బుచ్చమ్మ, వరమ్మ, పారిజాత, శైలజ, నర్సమ్మ, పూలమ్మ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట పట్టణంలో
యాదాద్రి: దళిత జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు అమలు పట్ల పలువురు దళిత సంఘాలు నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొదటి సారిగా దళితబంధును జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం వాసాలమర్రిలో ప్రారంభించడాన్ని స్వాగతిస్తూ యాదగిరిగుట్ట పట్టణంలో ఆదివారం ఎస్సీ కులాల దుకాణ సముదాయ లబ్ధిదారుల సంక్షేమ సంఘం కార్యవర్గం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన దళితబంధు పథకం ద్వారా ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుతుందని అభిప్రాయ పడ్డారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దళితులకు ప్రత్యేకమైన పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్గౌడ్, ఎస్సీ కులాల దుకాణ సముదాయ లబ్ధిదారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మీసాల ఉప్పలయ్య, లీగల్ ఆడ్వైజర్ కొన్నె వెంకటేశ్, గౌరవ సలహాదారు మీసాల స్వామి, ప్రధాన కార్యదర్శి పెరుమాండ్ల స్వామి, ఉపాధ్యక్షురాలు సుగుణమ్మ, నాయకులు బాగ్యమ్మ, తిరుమలమ్మ, గ్యాదపాక క్రాంతి పాల్గొన్నారు.