రాష్ట్ర దళిత సంఘాల ఐక్య పోరాట సమితి చైర్మన్ బేర బాలకిషన్
ఆర్కేపురం, ఆగస్టు 2: దళితుల అభ్యున్నతికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్కు దళిత సమాజం మొత్తం అండగా నిలువాలని రాష్ట్ర దళిత సంఘాల ఐక్య పోరాట సమితి చైర్మన్ బేర బాలకిషన్ పిలుపునిచ్చారు. దళితబంధు పథకాన్ని తీసుకొస్తున్నందుకు కృతజ్ఞతగా సోమవారం హైదరాబాద్లోని సరూర్నగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద మహేశ్వరం, ఎల్బీనగర్ నియోజకవర్గాల దళిత సంఘాలు కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశాయి. అంతకుముందు సరూర్నగర్లో వందలాది మంది దళిత సంఘాల నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బేర బాలకిషన్ మాట్లాడుతూ.. దళిత బంధును అడ్డుకోవాలని చూస్తున్న ప్రతిపక్షాలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. పథకంపై రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దళిత సంఘాల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు ఆకుల అరవింద్, సిరిపురం రాజేశ్ గౌడ్, దళిత సంఘాల ప్రతినిధులు పోలే అరవింద్కుమార్, జోగు రాములు, శ్రీధర్, దొబ్బు రాజు, గోపాల్, తదితరులు పాల్గొన్నారు.