కరీంనగర్: దళితులను కించపరిచేలా మాట్లాడిన ఈటల రాజేందర్ కుటుంబ సభ్యులపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దళితులను అసభ్య పదజాలంతో దూషించిన ఈటల కుటుంబ సభ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈటల బావమరిది వ్యాఖ్యలకు వ్యతిరేకంగా సూర్యపేట జిల్లా కేంద్రంలో దళిత సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈటెల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
హుజూరాబాద్లో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి బావమరిది మధుసూదన్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ఈటలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈటల కుటుంబంపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్ చేశారు.