హైదరాబాద్ : సీఎం కేసీఆర్ అధ్యక్షతన దళిత బంధు పథకం అమలుపై హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళిత ప్రతినిధులతో ప్రగతి భవన్లో జరిగిన అవగాహన సదస్సు ముగిసింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పథకం విధివిధానాలను దళిత ప్రతినిధులకు వివరించారు. పథకం గురించి ఎస్సీ ప్రతినిధుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, గోరటి వెంకన్న, ప్రభాకర్, రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, రసమయి బాలకిషన్, గాదరి కిషోర్, చంటి క్రాంతి కిరణ్, సండ్ర వెంకట వీరయ్య, దుర్గం చిన్నయ్య, హన్మంత్ షిండే, సుంకె రవిశంకర్, కే మానిక్ రావు, కాలె యాదయ్య, మెతుకు ఆనంద్, జీ సాయన్న, వీఎం అబ్రహం, చిరుమర్తి లింగయ్య, సీపీఎం, సీపీఐ జాతీయ నేతలు వెంకట్, బాలనర్సింహ., ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, కార్యదర్శులు స్మితాసబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్, ప్రభుత్వ ఉన్నతాధికారులు, హుజూరాబాద్ నియోజకవర్గానికి చెందిన సుమారు 450 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.