వరంగల్ అర్బన్ : రాష్ట్రంలో దళితులు సామాజికంగా, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని జమ్మికుంట మండల ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తెలిపారు. దళిత బంధు పథకం అమలుకు హుజురాబాద్ నియోజకవర్గాన్ని ఫైలెట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేసినందుకు హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండల ప్రజల పక్షాన సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జమ్మికుంట మండలం కోరపల్లి వెంకటేశ్వర్లపల్లి జంక్షన్ దగ్గర గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామ ప్రజలు నాయకులతో కలసి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..దళితుల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా జమ్మికుంట మండలంలోని 4,996 దళిత కుటుంబాలకు మేలు జరుగబోతుందన్నారు. అనంతరం ఎమ్మెల్యే డప్పుకొట్టి దరువేశారు. కార్యక్రమంలో జమ్మికుంట ఎంపీపీ మమత, జడ్పీటీసీ శ్యామ్, ఎంపీటీసీ ల ఫోరమ్ అధ్యక్షురాలు మమత, సర్పంచ్ గిరివేని రమ, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
దళిత బంధు చరిత్రలో నిలిచిపోతుంది : ఎల్. రమణ
చరిత్రలో ఈరోజు.. 14 బ్యాంకులను జాతీయం చేసిన ఇందిరాగాంధీ