హైదరాబాద్ : ఈ నెల 26న దళిత బంధు కార్యాచరణపై తొలి అవగాహన సదస్సు జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ అవగాహన సదస్సు నిర్వహణ. తెలంగాణ దళిత బంధు పథకం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్గా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ అవగాహన సదస్సుకు హుజూరాబాద్ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం, ప్రతీ మున్సిపాలిటీ నుంచి నలుగురు చొప్పున, వీరితో పాటు 15 మంది సదస్సుకు హాజరుకానున్నారు. మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సీఎం వెల్లడించారు.