కరీంనగర్ తెలంగాణ చౌక్, జూలై 22: రాష్ట్రం లో సామాజికంగా, ఆర్థికంగా వెనుబడిన దళితుల సాధికారత కోసం సీఎం తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ ప్రజా సంఘల చైర్మన్, తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గజ్జల కాంతం స్పష్టంచేశారు. గురువారం కరీంనగర్ జిల్లాకేంద్రంలో మీడియాతో ఆయన మాట్లాడారు. దళితల అభివృద్ధి ఏకైక లక్ష్యంగా ప్రతి కుటుంబనికి రూ.10లక్షలు అందించడం హర్షణీయమన్నారు. దళిత అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాన్ని దళిత వ్యతిరేకులు విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.