హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజు రోజుకూ పంథా మారుస్తున్నారు. ‘డిటో’ పేరుతో ఇప్పుడు కొత్త తరహా మోసాలకు తెరలేపారు. సోషల్ మీడియా అకౌంట్లలో సమాచారాన్ని, ప్రొఫైల్ ఫొటోలను తస్కరించి మన ఖాతాలను అచ్చుగుద్దినట్టు నకిలీలు తెరుస్తున్నారు. తర్వాత మన కాంటాక్ట్స్ లిస్టులో ఉన్నవారికి రిక్వెస్టులు పంపుతున్నారు. వారు అంగీకరించగానే మాయగాళ్లు పని మొదలుపెడుతున్నారు. ‘అత్యవసరంగా డబ్బులు కావాలి. రెండు రోజు ల్లో తిరిగి ఇచ్చేస్తా’ అంటూ మెస్సేజ్లు పంపుతారు. అవతలివారు డబ్బులు పంపితే ఆ వెంటనే వాటిని తమ ఖాతాల్లోకి మళ్లించుకుంటున్నారు. అసలు వ్యక్తికి సమాచారం వెళ్లేవరకు ఈ మోసాలు వెలుగులోకి రావడంలేదు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లలో ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్టు కేంద్ర హోంశాఖ వెల్లడించింది.
ఇలాచేస్తే మేలు..