చర్మ సంరక్షణ గురించి ఎవరైనా సలహాలిస్తే పెద్దగా పట్టించుకోరు చాలామంది. నమ్మకస్తులు సిఫారసు చేసినా ఫేస్ క్రీమ్లు కొనడానికి తెగ ఆలోచించేస్తారు. పైగా బోలెడు ఖర్చు ఎందుకు? అనుకుంటారు. కరోనా నేపథ్యంలో ఎలాగూ బయటకు వెళ్లడం తగ్గించేయడంతో చర్మ సౌందర్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల కోసమే బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా స్కిన్కేర్ టిప్స్ షేర్ చేసుకుంది. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ బ్యూటీ సలహాలు పంచుకుంది. చర్మానికి సంబంధించి తాను అమ్మ పాటించే చిట్కాలే ఫాలో అవుతానని చెప్పుకొచ్చింది. చర్మ సంరక్షణకు నెయ్యిని మించిన ఔషధం లేదంటున్నది సోనాక్షి. ‘నెయ్యి చర్మంపై బాగా పని చేస్తుందని మా అమ్మ చెప్పింది. వెంటనే ట్రై చేశాను. అది నా చర్మాన్ని మృదువుగా, నిరంతరం తాజాగా ఉంచుతున్నది. చర్మ కణాలను హైడ్రేట్ చేసి, పొడిబారిన చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తుంది. అంతేకాదు, ఈ నెయ్యి యాంటీ ఏజింగ్ సొల్యూషన్గానూ పని చేస్తుంది. ముఖంపైన, పెదాలపైన, కళ్ల కింద రాసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాదు వివిధ చర్మ సమస్యలు, బర్నింగ్ సెన్సేషన్కు నెయ్యి చెక్ పెడుతుందని ఆయుర్వేదంలోనూ ఉంద’ని తన పోస్ట్లో రాసుకొచ్చింది సోనాక్షి.