హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): వరుసగా రెండోరోజు ఐపీఎస్ల బదిలీలు కొనసాగాయి. సైబరాబాద్ సీపీగా ఉన్న వీసీ సజ్జనార్ టీఎస్ఆర్టీసీ ఎండీగా నియమితులయ్యారు. సజ్జనార్ పలు కీలక కేసులను దర్యాప్తు చేశారు. ఇందులో దిశ కేసు నిందితుల ఎన్కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఎం స్టీఫెన్ రవీంద్ర నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆయన వెస్ట్జోన్ ఐజీగా పనిచేశారు. స్టీఫెన్ రవీంద్ర ఉత్తమ సేవలకుగాను 2004లో అంత్రిక్ సురక్ష సేవా పతకం, 2005లో పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ, 2010లో లైఫ్ సేవింగ్ ప్రైమినిస్టర్స్ పోలీస్ మెడల్, 2016లో ప్రెసిడెంట్ పో లీస్ మెడల్స్ అందుకున్నారు. స్టీఫెన్ రవీంద్ర స్థానంలో ఐజీ శివశంకర్రెడ్డిని నియమించారు. ఈ మేరకు సీఎస్ సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు.