పల్లె ప్రగతి’ని నిర్లక్ష్యం చేస్తున్న సర్పంచ్లపై కలెక్టర్ సీరియస్
ఇప్పటికే 60 మందికి నోటీసులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘పల్లె ప్రగతి’పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న సర్పంచ్లపై కలెక్టర్ రాహుల్రాజ్ సీరియస్గా ఉన్నారు. శ్మశాన వాటికలు, డంప్యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు తదితర పనులు వేగంగా పూర్తి చేయాలని పదే పదే ఆదేశించినా, స్పందించని వారిపై చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 60 మంది సర్పంచ్లకు నోటీసులు జారీ చేశారు. సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన నేపథ్యంలో సత్వరమే పనులు పూర్తి చేయాలని, లేదంటే ఎంతటివారినైనా ఉపేక్షించేదిలేదని ఆయన హెచ్చరిస్తున్నారు.
పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం చూపుతున్న సర్పంచ్లపై చర్యలకు జిల్లా కలెక్టర్ సదన్నద్ధమవుతున్నారు. జిల్లాలో చేపడుతున్న పల్లె ప్రగతి పనుల్లో వేగం పెంచాలని, త్వరగా పూర్తిచేయాలని సమావేశాల్లో పదేపదే ఆదేశించినప్పటికీ స్పందించకుండా కొంత మంది సర్పంచ్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. పల్లె ప్రగతి ద్వారా చేపట్టిన శ్మశాన వాటికలు, డంప్ యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలను సకాలంలోపూర్తి చేయడంలో నిర్లక్ష్యం చూపుతు న్న 60 మంది సర్పంచ్లకు నోటీసులు జారీచేశా రు. పల్లె ప్రగతి పనుల్లో వేగం పెంచని సర్పంచ్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్న పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక దృష్టిని ప్రభుత్వం సారించిన విషయం తెలిసిందే.. దీనికోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టి సర్వేలు చేయించి గ్రామాల్లో ప్రజల మౌలిక అవసరాలు తీరేలా అనేక కార్యక్రమాలను చేపట్టింది. దీనిలో ముఖ్యంగా శ్మశాన వాటికలు, చెత్త డంప్యార్డులు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణాలు చేపట్టారు. పల్లె ప్రగతి పనులకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. ఇలాంటి పనులను చేయడంలో పలు పంచాయతీల సర్పంచ్లు, ఇతర మండల స్థాయి అధికారులు అలసత్వం చూపుతున్నారు. పనులు ప్రారంభించి ఏడాది కావస్తున్నప్పటికీ కొన్ని పంచాయతీల్లో చేపట్టిన పనుల్లో పురోగతి కనిపించడం లేదు.
పల్లె ప్రగతి పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాలో స్వయంగా పర్యటించి పనులను పరిశీలిస్తామని, నిర్లక్ష్యం వహించే అధికారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించడంతో అధికారుల్లో అలజడి మొదలైంది. గ్రామాల్లో చేపట్టిన పనులను పంచాయతీల వారీగా సమీక్షిస్తున్నారు. నిర్లక్ష్యంగా ఉండే పంచాయతీల సర్పంచ్లకు నోటీసులు జారీచేశారు.
పల్లె ప్రగతి పనులు సకాలంలో పూర్తిచేయడంతో నిర్లక్ష్యం చూపుతున్న పంచాయతీలకు నోటీసులు జారీ చేశారు. జిల్లాలోని పది మండలాల్లో 60 పంచాయతీలకు నోటీసులు అందా యి. తిర్యాణి మండలంలోని 14 పంచాయతీలకు, కాగజ్నగర్లో ఒకటి, ఆసిఫాబాద్ మండ లంలో నాలుగు, బెజ్జూర్ మండలంలో ఒకటి, చింతలమానేపల్లిలో నాలుగు, దహెగాంలో రెండు, జైనూర్ మండలంలో ఏడు, కెరమెరి మండలంలో ఐదు, రెబ్బెన మండలం ఐదు , సిర్పూర్(టీ) మండలంలోని ఆరు, వాంకిడి మండలంలోని తొమ్మిది పంచాయతీలకు నోటీసులు జారీ చేశారు. పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం వహించే ఈ పంచాయతీల సర్పంచ్ల నుంచి సరైన వివరణ రాకపోతే చర్యలు తీసుకోనున్నారు.
పల్లె ప్రగతి పనులు ప్రారంభించి దాదాపు సంవత్సరం అవుతున్నది. పనులను సకాలంలో పూర్తిచేయడంలో సర్పంచ్లు, వాటిని పర్యవేక్షించాల్సిన మండల స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మండల స్థాయిలో ఎంపీడీవోలు, రూరల్ డెవలప్మెంట్ అధికారులు, సంబంధింత ఇంజినీరిగ్శాఖ అధికారులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి, పనులు సకాలంలో జరిగేలా చర్యలు తీసుకోవాలి. కాని వివిధ కారణాలతో పనులను సకాలంలో పూర్తిచేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అనేక సందర్భాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహించి పల్లె ప్రగతి పనులను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. నిర్లక్ష్యం చేసే పంచాయతీలు, అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించినా పనులు పూర్తిచేయడంలో సదరు అధికారులు, ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యాన్ని వీడలేదు. పల్లె ప్రగతి పనులపై నిర్లక్ష్యం వహించిన 60 పంచాయతీలకు కలెక్టర్ నోటీసులు జారీ చేశారు.