హింస పడిన ప్రకృతికి తెలుసు
అలుసైపోయిన అవనికి తెలుసు
గాయపడిన పచ్చదనానికి తెలుసు
మాయమైన మూగజీవులకు తెలుసు
చంపేయబడ్డ ధర్మాత్ముల
ఆత్మఘోషలకు తెలుసు
రాలిపడిన పవిత్ర సాధ్విమనుల
కన్నీటి చుక్కలకు తెలుసు
కానీ ఆశవీడక ప్రాణవాయువు కోసం
డబ్బుల కట్టలు పట్టుకుతిరిగే
మానవులకు అర్థం కాదు!
బతుకుతీపికై వ్యాక్సిన్ కోసం
క్యూలు కట్టే మహానుభావులకు పట్టదు
మనసును మట్టిలో కప్పెట్టేసి
దేవుడా రక్షించు అని ఎగబడి ప్రదక్షిణలు చేసేవారికి ఎందుకు?
ఈ నవ నాగరికం ముందు
పాతేయబడ్డ పాత్రలు కదలాడినా
పశ్చాత్తాపం లేని ప్రాణిగా
మిగిలిపోయేది మానవుడే..
అర్థం చేసుకోకుంటే..!
డాక్టర్ బాలాజీ దీక్షితులు పీవీ
88853 91722