హైదరాబాద్: తెలుగు చిత్రసీమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తర పోరుకు తెరలేపాయి. మా అధ్యక్ష ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్నాయి. అయితే అధ్యక్ష బరిలో నటుడు ప్రకాశ్ రాజ్ పోటీ చేస్తున్నారు. హీరో ప్రకాశ్రాజ్ ఇప్పటికే తన ప్యానెల్ను ప్రటించారు. అయితే ఆయన్ను వ్యతిరేకిస్తున్నవారు నాన్లోకల్ అన్న ప్రస్థావన తీసుకువచ్చారు. దీనిపై మేటి దర్శకుడు రామ్గోపాల్ వర్మ స్పందించారు. తన ట్విట్టర్లో ఆయన సెటైర్లతో రియాక్ట్ అయ్యారు. కర్ణాటక నించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా ??? ఎలా ఎలా ఎలా ? అని రామ్గోపాల్ వర్మ తన ట్వీట్లో ప్రశ్నించారు.
కర్ణాటక నించి AP కి వచ్చిన ప్రకాశ్రాజ్ నాన్ లోకల్ అయితే, మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ గారు, ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ గారు లోకలా ??? ఎలా ? ఎలా ? ఎలా ? అని అడిగారు. ముప్పై ఏళ్లుగా నటుడు ప్రకాశ్ రాజ్ ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని , చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి , పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న ప్రకాశ్ రాజ్ నాన్లోకల్ ఎలా అవుతారని వర్మ అన్నారు.
ప్రకాశ్ రాజ్ నటనకు దేశం గుర్తింపు ఇచ్చిందని, నాలుగు సార్లు అతన్ని శాలువా కప్పి జాతీయ అవార్డులతో సత్కరిస్తే , ఆయన్ను ఎలా నాన్ లోకల్ అంటారన్నారు. ఇది ఇండియాకు వ్యతిరేకమైన కామెంట్ అన్నారు. ఇక మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకల్ అని.. మైఖేల్ జాక్సన్, బ్రూస్ లీ, సీతారాములు అంందరూ నాన్ లోకల్ అని వర్మ తన ట్వీట్లో తెలిపారు. కానీ తన మద్దతు ఎవరికన్న విషయాన్ని మాత్రం తన ట్వీట్లలో వర్మ స్పష్టం చేయలేదు.