వరంగల్ : రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు పథకం ద్వారా అందజేస్తున్న ఆర్థిక సాయం లబ్ధిదారుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. రైతు బంధు పథకం అభాగ్యుల జీవితానికి భరోసాను కల్పిస్తున్నది. రైతు బంధు డబ్బులతో లబ్ధిదారులు సంపదను సృష్టిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఈ పరిస్థితులను రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ స్వయంగా పరిశీలించారు.
పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలలో పాల్గొనేందుకు మంగళవారం హుజురాబాద్, జమ్మికుంట, వీణవంక మండలాల్లో పర్యటించేందుకు వినోద్కుమార్ వెళ్తున్నారు. కాగా, దారి మధ్య రోడ్డు పక్కన ఓ వృద్ధుడు తన కుమారుడితో కలిసి భూమిని చదును చేస్తున్న దృశ్యాన్ని గమనించిన వినోద్ కుమార్ కారును ఆపి వారి వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతు బంధు పథకం తమ జీవితాన్ని మార్చివేసిందని, రైతు బంధు సాయంతో పడావుగా ఉన్న భూములను సాగుకు యోగ్యంగా మార్చుకుని వ్యవసాయం చేసుకుంటూ సంపదను సృష్టిస్తున్నామని భీమదేవరపల్లి మండలం మాదేవరపల్లి గ్రామానికి చెందిన నూనె కనకయ్య ముదిరాజ్, గాజు అరవింద్ యాదవ్ తెలిపారు.
తనకు, తన పిల్లలకు కలిపి మొత్తం 8 ఎకరాలు ఉన్నాయని, రైతు బంధు పథకం ద్వారా అందుతున్న డబ్బులతో భూమిని చదును చేసుకుని సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నట్లు కనకయ్య తెలిపారు.
రైతులకు సీఎం కేసీఆర్ చేస్తున్న మేలును జన్మ జన్మలో మర్చిపోమని సంబురంగా వినోద్కుమార్కు తెలిపారు. క్షేత్ర స్థాయిలో రైతు బంధు పథకం చేస్తున్న మేలును చూసి వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తి రాష్ట్రంలోని ప్రతి పల్లెలో ఉండటం గర్వకారణం అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్కు భారీ టీమ్ను పంపనున్న చైనా
వెదజల్లే పద్ధతితో అధిక దిగుబడి : మంత్రి అల్లోల