హైదరాబాద్ : ఈ నెల 5వ తేదీన అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ధరణి ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం, ధాన్యం సేకరణ, వ్యాక్సినేషన్, కొత్త కలెక్టరేట్ భవనాల నిర్మాణ పనులు, ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు, కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుపై చర్చించనున్నారు.