హైదరాబాద్ : కరోనా ఉధృతి నేపథ్యంలో ఆక్సిజన్ కొరతతో రోగులు చనిపోతున్న విషయం విదితమే. ఈ క్రమంలో తెలంగాణలో కొవిడ్ను ఎదుర్కొనేందుకు అవసరమైన మెడికల్ ఆక్సిజన్ నిల్వలు, ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ క్షేత్రస్థాయి పర్యటన చేశారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని మెగా ఆక్సిజన్ ప్లాంట్ను సీఎస్ పరిశీలించారు. పీఎస్ఏ టెక్నాలజీతో ఆక్సిజన్ తయారయ్యే విధానాన్ని పరిశీలించారు. ఆక్సిజన్ జనరేటర్ ఆక్సిలైఫ్-32 మోడల్.. 500ల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తుంది. గాలిలో 21 శాతం ఆక్సిజన్, 78 శాతం నైట్రోజన్, ఇతర వాయువులు ఉంటాయి. కానీ 93 శాతం స్వచ్ఛతతో తయారయ్యే ఆక్సిజన్ను రోగుల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు.