పటాన్చెరు, మే 25: సంగారెడ్డి జిల్లా పటాన్చెరులోని పాశమైలారం పారిశ్రామికవాడలో ఎయిర్వాటర్ ఇండియా పరిశ్రమలో మంగళవారం నుంచి ఆక్సిజన్ ఉత్పత్తి ప్రారంభమయింది. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో పునరుద్ధరించబడిన ఈ ప్లాంటులో రోజుకు 40 టన్నుల మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేయనున్నారు. ప్లాంట్ను సీఎస్ సోమేశ్కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా రోగులకు ఆక్సిజన్ అత్యవరమైన నేపథ్యంలో 2014లో మూతబడిన ఎయిర్వాటర్ ఇండియా ఆక్సిజన్ ప్లాంట్ను పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. గ్రీన్కో అనే సంస్థ ఈ నిలిచిపోయిన ఆక్సిజన్ ప్లాంట్ను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించిందని తెలిపారు. ఆయన వెంట పరిశ్రమలశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, ఐలా పాశమైలారం అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.