న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఉదయం కన్యాకుమారిలో రోడ్ షో నిర్వహించిన ఆయన కేంద్ర ప్రభుత్వంపైన, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామిపైన తీవ్ర విమర్శలు చేశారు. ఆ తర్వాత ములగుమూడుబన్ ఏరియాలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ఫ్లోర్పై పుష్ అప్స్ చేశారు. జపాన్ చెందిన మార్షల్ ఆర్ట్స్ కళ అయిన ఐకిడోను ప్రదర్శించారు. అంతేకాదు అందరితో కలిసి నృత్యాలు కూడా చేశారు.