బదోహి : ఉత్తరప్రదేశ్లోని బదోహి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతిచెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. వారణాసికి చెందిన వికాస్ గౌతమ్ (22), గోలు (22), దిలీప్ (25), దీపు (23), ప్రీతమ్ (30), ట్వింకిల్ (22) కారులో అలహాబాద్కు బయల్దేరారు.
బదోహి జిల్లా గోపీగంజ్ ప్రాంతంలోని లాల్నగర్ టోల్ప్లాజా వద్ద కారు అదుపుతప్పి స్టేషనరీ లోడ్తో వెళ్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రగాయాలై గోలు, దీపు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన వికాస్ను వారణాసిలోని దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు. మిగిలిన ముగ్గురు దవాఖానలో చికిత్స పొందుతున్నట్లు ఎస్పీ రాంబదన్ సింగ్ తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించారు.