శామీర్పేట, జూలై 8: ఆన్లైన్ పాఠాలు శ్రద్ధంగా వినాలని, ఏమైనా సందేహాలు ఉంటే ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారి ఎన్ఎస్ఎస్ ప్రసాద్ విద్యార్థులకు సూచించారు. జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ ప్రతిరోజూ టెలివిజన్, చరవాణిల్లో ప్రసారమయ్యే పాఠాలను శ్రద్ధగా వినాలని సూచించారు. అవి అందుబాటులో లేని విద్యార్థులను గుర్తించి.. సమీప విద్యార్థులతో కలిసి పాఠాలు వినేలా ఉపాధ్యాయులు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శేఖరయ్య, ఉపాధ్యాయులు పాండురంగారెడ్డి, ఆదినారాయణ, సురేందర్, నవీన్, అంజనీ, శ్యామల తదితరులు పాల్గొన్నారు.