హైదరాబాద్ : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా గౌడన్ల నిర్మాణాల కోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని తగు చర్యలను వేగవంతం చేయాలని అధికారులను సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాష్ట్రంలో గౌడన్ల నిర్మాణాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ అధికారులతో మంగళవారం బీఆర్కేఆర్ భవన్లో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. గౌడన్ల నిర్మాణాలకు సంబంధించి భూమి, ఇతర సమస్యల విషయమై జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, టెస్కాబ్ చైర్మన్ రవీందర్ రావు, టెస్కాబ్ ఎండీ మురళీధర్, నాబార్డ్ జీఎం(రిటైర్డ్), ఇంచార్జ్ ఆఫ్ ప్రాజెక్ట్ షరీఫ్, తదితరులు పాల్గొన్నారు.