ఇంటర్లో ప్రతిభ చూపిన షకీనా
హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన సీఆర్పీఎఫ్ సిబ్బంది పిల్లలకు ఇచ్చే డీజీ ట్రోఫీ వరంగల్కు చెందిన సీఆర్పీఎఫ్ ఏడో బెటాలియన్ అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ యాకూబ్ కుమార్తె షకీనాకు దక్కింది. సోమవారం సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ హెడ్క్వార్టర్స్లో జరిగిన కార్యక్రమంలో డీఐజీలు కే సజానుద్దీన్, రాజ్కుమార్లు షకీనాకు పురస్కారాన్ని, రూ.20 వేల నగదును అందజేశారు. షకీనా సీబీఎస్ఈ సిలబస్లో గతేడాది ఇంటర్ ఫలితాల్లో 942 మార్కులతో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానాన్ని దక్కించుకున్నది. ప్రస్తుతం కాకతీయ వర్సిటీలో బీటెక్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ పొందింది. కార్యక్రమంలో డిప్యూటీ కమాండెంట్ టీపీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.