మహాముత్తారం, ఆగస్టు8 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం పోలీస్స్టేషన్లో ఆదివారం విద్యుత్తు షాక్తో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. సీఆర్పీఎఫ్ క్యాంపు వద్ద హర్యానా రాష్ర్ర్టానికి చెందిన పవన్సింగ్ (38) బ్యాడ్మింటన్ కోర్ట్ వద్ద బల్బు అమర్చుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్కు గురయ్యాడు. గమనించిన తోటి సిబ్బంది హుటాహుటిన భూపాలపల్లిలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. పరిశీలించిన వైద్యులు పవన్సింగ్ చనిపోయాడని ధ్రువీకరించారు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. బీ/58 బీఎన్ సీఆర్పీఎఫ్ కమాండింగ్ ఆఫీసర్ టీఎల్ లీనిష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మహాముత్తారం ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.